Telangana Liquor Sales: మనోళ్లు మామూలోళ్లు కాదు.. వెయ్యి కోట్ల మందు తాగేశారు..
- తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి..
- పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు..
- 11 రోజుల్లో తెలంగాణలో వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తేల్చిన అబ్కారీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Liquor Sales: తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో ఖజానాకు మద్యం భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ నగరంలోనే భారీ విక్రయాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. పండుగ చివరి రోజైన శని, ఆదివారాల్లో అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. దీంతో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు తక్కువ కాలంలోనే భారీగా ఆదాయం సమకూరింది.
Read also: Rajanna Sircilla: తాగి చిల్ అవ్వాలి గానీ.. ఛాలెంజ్ చేసి ప్రాణంతో చెలగాటం అవసరమా?
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు పబ్బుల్లోనూ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏటా దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగానే జరుగుతుంటాయి. ఈసారి కూడా అదే అంచనాతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా భారీ మద్యం నిల్వలను సిద్ధం చేసింది. అదే విధంగా ఆర్డర్లు వచ్చాయి. బార్లు, మద్యం దుకాణాల్లో భారీగా నిల్వలు ఉంచారు. దసరా ప్రారంభానికి ముందే అమ్మకాల జోరు మొదలైంది. సెప్టెంబర్ 30, 2024 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇక అక్టోబర్ ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల మద్యం విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా 17.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండుగ చివరి మూడు రోజులు అంతకు మించి అమ్ముడుపోయాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల విలువైన మద్యం రిటైల్ షాపులకు చేరింది. అందులో మద్యం, బీరు విక్రయాలు పోటీ పడ్డాయి. మనోళ్లు మద్యం తాగి మద్యానికే మత్తెక్కించేలా రికార్డు సృష్టించారు.
పచ్చివి తింటే కడుపు నొప్పి.. మరి ఉడికించి తింటే..?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!