ఛార్జీల పెంపునకు ఆర్టీసీ కసరత్తు.. కిలోమీటర్కు పావలా వడ్డింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచితే… కొన్ని ప్రాంతాలకు టికెట్ ధర 186 రూపాయలు, ఇంకొన్ని ప్రాంతాలకు 204 రూపాయలకు పెరుగుతాయి ఛార్జీలు. వీటి 200, 240 రూపాయలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. పల్లె, నగర బస్సులకూ ఇదే విధానం అమలు చేయాలన్నది అధికారుల ఆలోచన. ఈ రెండు సర్వీసుల్లో కనీస ఛార్జీలను సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఛార్జీలను సవరించారు. కనీస చార్జీలను సర్దుబాటు చేశారు. ఏడు రూపాయలున్న కనీస ఛార్జీని అయిదు రూపాయలకు తగ్గించి, ఎనిమిది రూపాయిలున్న చార్జీలను పది రూపాయలకు పెంచారు. అలాగే, 12 రూపాయలున్న చార్జీని 15 రూపాయలకు మార్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.
వచ్చే నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. అయితే, 2010లో ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్ బస్సు ఛార్జీలు 25 శాతం పెంచారు. తర్వాత 2011లో చార్జీలు 8 శాతం పెరిగాయి. బస్సు టికెట్ ధరల వల్ల చిల్లర సమస్య వస్తుందంటూ 2012లో ఛార్జీలను సవరించారు. 2013లో 10 శాతం పెంచగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో 10శాతం పెరిగాయి చార్జీలు. అయితే, 2018-19లో ఆర్టీసీ 928 కోట్ల రూపాయల నష్టాలు చవి చూసింది. హైదరాబాద్లో 544 కోట్లు, జిల్లాల్లో 384 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కిలో మీటర్కు సగటున 7 రూపాయల పది పైసలు నష్టం వస్తోంది. హైదరాబాద్లో కిలో మీటరకు 42 రూపాయల 66 పైసల ఆదాయం వస్తుంటే… 58 రూపాయల 78 పైసలు ఖర్చవుతోంది. ఇందులో సిబ్బంది జీతాలకే 80 శాతం ఖర్చవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల సంస్థ లాభాల్లోకి రాదని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత టికెట్ చార్జీలు 20 శాతం పెరిగాయి. ఇప్పుడు మళ్లీ కిలో మీటరుకు పావలా చొప్పున భారం మోపుతామనడం సరికాదంటున్నారు ప్రయాణికులు.
Also Read
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!