Telangana: సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవంగా జరపాలని బీజేపీ నిర్ణయం
Telangana Liberation Day on September 17: తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని భారీగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17వరకు ఏడాది పాటు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలపబడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది బీజేపీ పార్టీ. 2023 సెప్టెంబర్ 17న 75వ తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం తరహాలోనే తెలంగాణ విముక్తి ఉత్సవాలు జరిపేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విముక్తి సమయంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు.
సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై తెలంగాణ విమోచన దినోత్సవం అని కాకుండా తెలంగాణ విముక్తి దినోత్సవం అనాలని బీజేపీ నిర్ణయించింది.
Read Also: వివిధ దేశాలకు అధినేతలైన భారత సంతతి వ్యక్తులు వీరే..
Also Read
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలే అభివృద్ధి చెందుతున్నాయి: రఘునందన్ రావు.
తెలంగాణలో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలే అభివృద్ధి చెందుతున్నాయని.. వేరే అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని..కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించకుంటే కల్వకుర్తి నుండి ప్రగతి భవన్ ని పాదయాత్రగా ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై రాష్ట్రంలో ఏ అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా.? అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తుందని వెంటనే కేటీఆర్, హరీష్ రావు రాజీనామా చేసి ఆ పదవులను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోెకి రాగానే దళిత అభ్యర్థిని రాష్ట్రపతి చేసిందని.. స్వతంత్ర భారతంలో ఒక గిరిజ మహిళని రాష్ట్రపతి చేస్తున్న ఘటన బీజేపీదే అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!