Telangana Assembly: 8 రోజులు.. 45 గంటలు.. 3 బిల్లులు.. 2 తీర్మానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్న (శనివారం)తో ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తమిళసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ ఫిబ్రవరి 17 వరకు కొనసాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు వాడివేడి చర్చలు జరిగాయి. ఇక చివరి రోజైన శనివారం సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల, దానిపై చర్చ కొనసాగింది. హాట్ హాట్ గా కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి 8.20 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Read also: Anjana Bhowmik Death: చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ హీరోయిన్ మృతి!
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ఈ నెల 8న ప్రారంభమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు సాగాయి. తొలిరోజు (8వ తేదీ) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సాయి సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాద తీర్మానం 9వ తేదీన చర్చకు వచ్చింది. మూడో రోజు (10వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ ఖాతా బడ్జెట్ను సభలో ప్రతిపాదించింది. మరుసటి రోజు ఆదివారం అసెంబ్లీకి సెలవు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఓటాన్ ఖాతా బడ్జెట్ ప్రతిపాదన, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకూడదని తీర్మానం, కుల గణనపై తీర్మానం, నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం వంటి అంశాలను హైలైట్ చేశారు.
Read also: MRO Ramanaiah: హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య ఇంట్లో మరో విషాదం
పలు సందర్భాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, టీ.హరీశ్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. మొత్తం 8 రోజుల శాసనసభ సమావేశాల్లో 59 మంది ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. దాదాపు 45 గంటల పాటు సమావేశం కొనసాగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని కుల గణనపై మరో తీర్మానం చేశారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశాల్లో మరో 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Popcorn : పాప్కార్న్ ఇష్టంగా తింటున్నారా.. మీకు పోయే కాలం దగ్గరపడ్డట్టే
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!