Kodandaram: ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి ప్రవళికను మరోసారి చంపేశారు.. కోదండరాం ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodandaram: ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. ప్రవళిక సూసైడ్ పై ప్రభుత్వం, కేటీఆర్, పోలీసుల అసత్య ప్రచారం పై నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్, AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు హాజరయ్యారు. ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం ధ్యేయంగా హైదరాబాద్ కి వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతనే.. ఇంటికి వస్తా అని ఇంట్లో చెప్పింది ప్రవళిక అన్నారు. పేపర్ లీకేజ్, పరీక్ష రద్దు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి తమ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.
ప్రవళిక సూసైడ్ ని ఎదుర్కోలేక.. అమ్మాయి వ్యక్తిత్వం దెబ్బతీయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ప్రకటనపై చర్చకు సిద్దమన్నారు. జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రకటించడం లేదన్నారు. TSPSC ని రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్న స్పందన లేదని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS మేనిఫెస్టోలో పెన్షన్, రైతుబంధు, గ్యాస్ ధర తప్ప.. ఎక్కడా ఉద్యోగాలపైన లేదంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోలోనే నిరుద్యోగులు లేకపోతే.. వాళ్ళ విధానాల్లో ఎక్కడ ఉంటామన్నారు. నిరుద్యోగులపై అడిగే ప్రశ్నలకు ఒక్క సమాధానం ఇస్తే.. ముక్కు నాలకు రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతాం అంటే.. ఎలక్షన్ కోడ్ వస్తుందని పోలీసులు అంటున్నారని అన్నారు. ప్రవళిక పైన వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ పెడితే.. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
గ్రామీణ ప్రాంతం నుంచి తన కలలను నిజం చేసుకోవాలని ప్రవళిక హైదరాబాద్ కి వచ్చిందని AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ అన్నారు. ఈ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి, ఎగ్జామ్స్ వాయిదా చేయడం వల్ల… సూసైడ్ చేసుకుందని అన్నారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల హైదరాబాద్ లో ఉండి.. హాస్టల్స్ లో ఉండి.. ప్రిపేర్ అవ్వాలంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని తెలిపారు. దీంతో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, వాళ్ల పేరెంట్స్ పై ప్రెజర్ పెరిగిపోతుందన్నారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రవళిక పై డిప్రెషన్ పెరిగిపోయి సూసైడ్ చేసుకుందని తెలిపారు. కేవలం ప్రవళిక నే కాకుండా… చాలా మంది స్టూడెంట్స్ పై ప్రెజర్ పెరిగిపోతుందన్నారు. ప్రవళిక పైన BRS ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రవళిక కారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. ప్రవళిక ఇంటికి వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నామన్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డ కారెక్టర్ గురించి ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Zomato Delivery Girl: జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా హాట్ లేడీ.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!