Telangana Jagruthi: నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం.. సాగునీటి ప్రాజెక్టులపై కీలక చర్చ!
- నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం..
- సాగునీటి ప్రాజెక్టులపై ఉ. 11గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం..
- నీళ్లు-నిజాలు పేరుతో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశం..
- జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Jagruthi: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలపై కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు (జనవరి 31) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొననున్నారు.
Read Also: Health Tip: వీటిని ఫ్రిజ్లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Also Read
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు కేసీఆర్ నిర్మించిన కీలక ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేస్తుంది.. కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి పేర్కొనింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని వెల్లడించారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. ఇక, అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదించనున్నారని చెప్పుకొచ్చారు.
Read Also: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
ఇక, కేసీఆర్ ప్రారంభించారనే కోపంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా ఆపేసింది అని తెలంగాణ జాగృతి ఆరోపించింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించిన ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలోనూ ఈ సర్కార్ కి క్లారిటీ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్ పనులు చేయడం లేదు.. అలాగే, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని పేర్కొంది. ఈ అన్ని అంశాలను ప్రజలకు తెలియజేడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది.
తాజావార్తలు
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్