Telangana Jagruthi: నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం.. సాగునీటి ప్రాజెక్టులపై కీలక చర్చ!
- నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం..
- సాగునీటి ప్రాజెక్టులపై ఉ. 11గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం..
- నీళ్లు-నిజాలు పేరుతో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశం..
- జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Jagruthi: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలపై కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు (జనవరి 31) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొననున్నారు.
Read Also: Health Tip: వీటిని ఫ్రిజ్లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు కేసీఆర్ నిర్మించిన కీలక ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేస్తుంది.. కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి పేర్కొనింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని వెల్లడించారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. ఇక, అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదించనున్నారని చెప్పుకొచ్చారు.
Read Also: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
ఇక, కేసీఆర్ ప్రారంభించారనే కోపంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా ఆపేసింది అని తెలంగాణ జాగృతి ఆరోపించింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించిన ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలోనూ ఈ సర్కార్ కి క్లారిటీ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్ పనులు చేయడం లేదు.. అలాగే, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని పేర్కొంది. ఈ అన్ని అంశాలను ప్రజలకు తెలియజేడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!