గెజిట్ అమలు వాయిదా వేయాలి.. తెలంగాణ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డ్ పరిధిలోకి వెళ్తుందని.. జీఆర్ఎంబీ సమావేశంలో ఈ రోజు చర్చిస్తామని తెలిపారు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.. పెద్దవాగు పరిధిలో 2 వేల ఎకరాలు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఏపీకి ఉందన్న ఆయన.. ఏపీ కోరుతున్నట్టుగా మిగతా ప్రాజెక్టులు బోర్డ్ పరిధిలోకి ఇప్పట్లో కుదరదు అన్నారు.
ఇక, ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్నారు రజత్ కుమార్… రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వీటిపై కేంద్రాన్ని స్వయంగా కలిసి గడువు కావాలని విన్నవించారని తెలిపిన ఆయన.. ప్రస్తుతం గోదావరి బోర్డ్ పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వెళ్తుందని వెల్లడించారు.. ఇక, సబ్ కమిటీ నివేదికలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కాగా, ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి తేవాలన్న ప్రయత్నాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!