IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
- తెలంగాణలో 26 మంది IPS అధికారుల బదిలీ
- వరంగల్ కొత్త సీపీగా ఎన్. శ్వేత నియామకం
- జోనల్ డీఐజీలకు అదనపు బాధ్యతలు
- సీఐడీ, ఇంటెలిజెన్స్లో కీలక పోస్టింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Transfers: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు కీలక అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది.
వరంగల్ కొత్త సీపీగా ఎన్. శ్వేత.. సున్ప్రీత్ సింగ్ బదిలీ
హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్గా బదిలీ అయ్యారు. దీనితో పాటు ఆమెకు మల్టీజోన్ పరిధిలోని డీఐజీ (జోన్-4, భద్రాద్రి) పూర్తి అదనపు బాధ్యతలను (FAC) అప్పగించారు. ఇప్పటివరకు వరంగల్ సీపీగా ఉన్న సున్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా నియమించారు. ఆయనకు అదనంగా డీఐజీ (జోన్-3, రాజన్న) బాధ్యతలను కూడా కేటాయించారు. అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్కు హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్గా అదనపు బాధ్యతలు దక్కాయి.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
జోనల్ డీఐజీలుగా కీలక అధికారులకు అదనపు బాధ్యతలు
రామగుండం పోలీస్ కమిషనర్గా ఉన్న అంబర్ కిశోర్ ఝాకు అదనంగా డీఐజీ (జోన్-1, కాళేశ్వరం) బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ డీఐజీ (జోన్-5, యాదాద్రి)గా, ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్ డీఐజీ (జోన్-2, బాసర)గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.
సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో నియామకాలు
తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఉన్న చి. సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అంతేకాకుండా ఎస్పీ (ఎస్ఐబీ)గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్ఐబీ ఎస్పీగా ఉన్న వై. సాయి శేఖర్ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ డీసీపీగా ఉన్న చెర్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఉన్న చి. ప్రవీణ్ కుమార్లు సీఐడీ ఎస్పీలుగా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీగా నియమించగా, గతంలో ఆయనను సీఐడీ ఎస్పీగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇక వనపర్తి అదనపు ఎస్పీగా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న బి. రాములు నాయక్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!