Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
- మే జీతం నుంచే 1.5% EHS కోత అమలు
- భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరికే కోత
- డబుల్ కటింగ్ అయితే రీఫండ్ హామీ
- ఉద్యోగుల ఆరోగ్య నిధికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం అమలవుతున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) నిధి సమకూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొత్త ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 29, 2026 నాటి అధికారిక జీవో (G.O.Ms.No.79) ప్రకారం ఇకపై ప్రతి ఉద్యోగి మూల వేతనం (Basic Pay) లేదా పెన్షనర్ల మూల పింఛను (Basic Pension) నుండి ప్రతి నెలా 1.5 శాతం మొత్తాన్ని ఈ ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్కు విరాళంగా కట్ చేయనున్నారు. మే 2026 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల (జూన్లో చెల్లించేవి) నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులుంటే ఎలా? డబుల్ కటింగ్ పడకుండా రూల్స్
ఈ నిధుల కోత విధానంలో ఉద్యోగులపై అదనపు భారం పడకుండా, ఎక్కడా డబుల్ కటింగ్ జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు, లేదా వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరొకరు ప్రభుత్వ పెన్షనర్గా ఉన్నప్పుడు కేవలం ఒక్కరి జీతం నుండి మాత్రమే ఈ మొత్తాన్ని మినహాయిస్తారు. అలాగే ఒకే వ్యక్తి ప్రభుత్వ సర్వీస్ పెన్షన్ , ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండు పింఛన్లు పొందుతున్నప్పుడు కూడా ఒకే ఒక కోతకు నిబంధనలను పరిమితం చేశారు. ఇలాంటి సందర్భాలలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ఎమ్ఎస్ (IFMIS-HRMS) సాఫ్ట్വേర్ సిస్టమ్లో పక్కాగా నమోదు చేసి, పొరపాటున కూడా రెండోసారి కటింగ్ అవ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా ఇలా అదనంగా డబ్బులు కట్ అయి ఉంటే, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు గానూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) చైర్పర్సన్గా ఒక ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడిన ‘న్యూ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చే 1.5 శాతం వాటా నిధికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు మ్యాచింగ్ గ్రాంట్ను ఈ హెల్త్ కేర్ ట్రస్ట్కు జమ చేయనుంది. సేకరించిన నిధులన్నింటినీ ప్రత్యేక అకౌంట్ హెడ్ ద్వారా మెడికల్ అవసరాల నిమిత్తం భద్రపరుస్తారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?