Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
- మే జీతం నుంచే 1.5% EHS కోత అమలు
- భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరికే కోత
- డబుల్ కటింగ్ అయితే రీఫండ్ హామీ
- ఉద్యోగుల ఆరోగ్య నిధికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం అమలవుతున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) నిధి సమకూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొత్త ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 29, 2026 నాటి అధికారిక జీవో (G.O.Ms.No.79) ప్రకారం ఇకపై ప్రతి ఉద్యోగి మూల వేతనం (Basic Pay) లేదా పెన్షనర్ల మూల పింఛను (Basic Pension) నుండి ప్రతి నెలా 1.5 శాతం మొత్తాన్ని ఈ ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్కు విరాళంగా కట్ చేయనున్నారు. మే 2026 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల (జూన్లో చెల్లించేవి) నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులుంటే ఎలా? డబుల్ కటింగ్ పడకుండా రూల్స్
ఈ నిధుల కోత విధానంలో ఉద్యోగులపై అదనపు భారం పడకుండా, ఎక్కడా డబుల్ కటింగ్ జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు, లేదా వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరొకరు ప్రభుత్వ పెన్షనర్గా ఉన్నప్పుడు కేవలం ఒక్కరి జీతం నుండి మాత్రమే ఈ మొత్తాన్ని మినహాయిస్తారు. అలాగే ఒకే వ్యక్తి ప్రభుత్వ సర్వీస్ పెన్షన్ , ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండు పింఛన్లు పొందుతున్నప్పుడు కూడా ఒకే ఒక కోతకు నిబంధనలను పరిమితం చేశారు. ఇలాంటి సందర్భాలలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDOs) ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ఎమ్ఎస్ (IFMIS-HRMS) సాఫ్ట్വേర్ సిస్టమ్లో పక్కాగా నమోదు చేసి, పొరపాటున కూడా రెండోసారి కటింగ్ అవ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా ఇలా అదనంగా డబ్బులు కట్ అయి ఉంటే, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
Also Read
- Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
- Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
- Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు గానూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) చైర్పర్సన్గా ఒక ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడిన ‘న్యూ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చే 1.5 శాతం వాటా నిధికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు మ్యాచింగ్ గ్రాంట్ను ఈ హెల్త్ కేర్ ట్రస్ట్కు జమ చేయనుంది. సేకరించిన నిధులన్నింటినీ ప్రత్యేక అకౌంట్ హెడ్ ద్వారా మెడికల్ అవసరాల నిమిత్తం భద్రపరుస్తారు.
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!