Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- ఆరుగురు ఐపీఎస్లకు ప్రమోషన్
- డీజీపీ హోదా మంజూరు
- ఇన్-సిటు కొనసాగింపు
- పోలీస్ శాఖలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1995 , 1996 బ్యాచ్కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవో నంబర్ 509 ప్రకారం, వీరికి ‘అబవ్ సూపర్ టైమ్ స్కేల్ (ii)’ గ్రేడ్లో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు.
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఈ పదోన్నతి పొందిన అధికారులలో 1995 బ్యాచ్కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ ఉండగా, 1996 బ్యాచ్ నుండి చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ , వి.సి. సజ్జనార్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీరంతా ఇకపై డీజీపీ స్థాయి హోదాలో తమ సేవలను అందించనున్నారు. అయితే, ప్రస్తుతానికి వీరిని వారు నిర్వహిస్తున్న పాత పోస్టుల్లోనే కొనసాగిస్తూ (In-situ) ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బాధ్యతలలో మార్పు లేకుండానే వారి హోదా , వేతన శ్రేణిని పే మ్యాట్రిక్స్ లెవల్ 16కు పెంచడం జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న వి.సి. సజ్జనార్ , కీలక విభాగాల్లో ఉన్న మహేష్ భగవత్ వంటి అధికారులకు ఈ అత్యున్నత హోదా దక్కడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ఆరుగురు అధికారులను డీజీపీ స్థాయికి ప్రమోట్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది.
తాజావార్తలు
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!