Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- ఆరుగురు ఐపీఎస్లకు ప్రమోషన్
- డీజీపీ హోదా మంజూరు
- ఇన్-సిటు కొనసాగింపు
- పోలీస్ శాఖలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1995 , 1996 బ్యాచ్కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవో నంబర్ 509 ప్రకారం, వీరికి ‘అబవ్ సూపర్ టైమ్ స్కేల్ (ii)’ గ్రేడ్లో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు.
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
Also Read
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- OTR : నాంపల్లిలో SIR జరగాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్
ఈ పదోన్నతి పొందిన అధికారులలో 1995 బ్యాచ్కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ ఉండగా, 1996 బ్యాచ్ నుండి చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ , వి.సి. సజ్జనార్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీరంతా ఇకపై డీజీపీ స్థాయి హోదాలో తమ సేవలను అందించనున్నారు. అయితే, ప్రస్తుతానికి వీరిని వారు నిర్వహిస్తున్న పాత పోస్టుల్లోనే కొనసాగిస్తూ (In-situ) ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బాధ్యతలలో మార్పు లేకుండానే వారి హోదా , వేతన శ్రేణిని పే మ్యాట్రిక్స్ లెవల్ 16కు పెంచడం జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న వి.సి. సజ్జనార్ , కీలక విభాగాల్లో ఉన్న మహేష్ భగవత్ వంటి అధికారులకు ఈ అత్యున్నత హోదా దక్కడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ఆరుగురు అధికారులను డీజీపీ స్థాయికి ప్రమోట్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..