Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఈ రోజు (బుధవారం) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు “ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తాయని” అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐ-ప్యాక్ కో-ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు జరుగుతుండగానే ఆమె లోపలికి వెళ్లి కొన్ని కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది.” అని బెంచ్ పేర్కొంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్య అని, దానికి కేంద్రం-రాష్ట్రం మధ్య వివాదం అనే రంగు పులమడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. “రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ లేదా హెచ్.ఎమ్. సీర్వాయి వంటి వారు కూడా ఒక ముఖ్యమంత్రి దర్యాప్తులో అడ్డుతగులుతారని ఊహించి ఉండరు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. ఈడీ ఒక ఏజెన్సీ మాత్రమేనని, దానికి ప్రాథమిక హక్కులను క్లెయిమ్ చేసే అధికారం లేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ తరపున మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రం ఒకేసారి ‘నేరస్థుడు, బాధితుడు’ కాలేదని వాదించారు. దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం, అదీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడ్డుతగలడం చట్టబద్ధమైన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!