MLAs Bribe Case: ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు ట్విస్ట్.. అందుకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court Orders To Shift MLA Bride Case From SIT To CBI: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. సిట్ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. వెంటనే ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు వివరాల్ని సీబీఐకి అందజేయాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేల ఎర కేసు విచారణని సీబీఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్ని మాత్రం న్యాయస్థానం కొట్టివేసింది. నందకుమార్, శ్రీనివాస్తో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లకు అనుమతి ఇస్తూ.. ఈ తీర్పుని కోర్టు వెల్లడించింది.
Cess Votes Counting: సెస్ ఎన్నికల లెక్కింపులో గందరగోళం.. బీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య గొడవ
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
ఏసీబీ చేయాల్సిన దర్యాప్తు సిట్ ఎలా చేస్తుందని పిటిషనర్స్ తమ వాదనలు తెలిపారు. నగదు లేనప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ ఎలా వర్తిస్తుందని.. ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని పిటిసనర్స్ వాదించారు. దర్యాప్తు ఎవిడెన్స్ సీఎం చేతికి ఎలా చేరాయని ప్రశ్నించారు. ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉందని, సంబందం లేని వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, సీబీఐతో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పిటిషనర్స్ వాదించారు. పిటీషనర్స్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. కేసుని సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను సిట్ అప్పీల్ చేయబోతోంది. కాగా.. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ కుట్ర జరిగిన సంగతి తెలిసిందే! మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో ఈ వ్యవహారం కొనసాగింది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగానే.. సీఎం కేసీఆర్ అప్పట్లో మునుగోడు ఉపఎన్నికలు ముగిసిన రోజే కొన్ని వీడియోలను విడుదల చేశారు.
ZPTC Mallesham Case: జెడ్పీటీసీ మల్లేశం కేసులో ట్విస్ట్.. అర్థరాత్రి నుంచే ప్లాన్
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!