Weather Alert : తెలంగాణలో నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు
- తెలంగాణలో మరోసారి భారీ వర్షాల ప్రభావం
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. వాతావరణ శాఖ హెచ్చరిక
- ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాల తీవ్రత పెరగనుంది
- ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.. వ్యవసాయరంగానికి శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert : తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం, రాష్ట్రంలోని అధికభాగం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల మాత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, గాలి దిశల్లో మార్పులు చోటుచేసుకోవడం వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉన్నట్లు సూచించారు.
Tejashwi Yadav: నితీష్కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు అంతర్భాగాల వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా, తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు వ్యవస్థల ప్రభావం వల్లే ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆదివారం నాడు కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు దగ్గర నిలబడకూడదని హెచ్చరించింది. వ్యవసాయరంగానికి ఇది శుభవార్తగా మారవచ్చని, ముఖ్యంగా రబీ పంటలకు తగినంత తేమ అందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
RRB NTPC 2025: రైల్వేలో కొలువుల జాతర.. 8850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!