Weather Alert : తెలంగాణలో నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు
- తెలంగాణలో మరోసారి భారీ వర్షాల ప్రభావం
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. వాతావరణ శాఖ హెచ్చరిక
- ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాల తీవ్రత పెరగనుంది
- ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.. వ్యవసాయరంగానికి శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert : తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం, రాష్ట్రంలోని అధికభాగం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల మాత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, గాలి దిశల్లో మార్పులు చోటుచేసుకోవడం వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉన్నట్లు సూచించారు.
Tejashwi Yadav: నితీష్కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
Also Read
వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు అంతర్భాగాల వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా, తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు వ్యవస్థల ప్రభావం వల్లే ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆదివారం నాడు కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు దగ్గర నిలబడకూడదని హెచ్చరించింది. వ్యవసాయరంగానికి ఇది శుభవార్తగా మారవచ్చని, ముఖ్యంగా రబీ పంటలకు తగినంత తేమ అందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
RRB NTPC 2025: రైల్వేలో కొలువుల జాతర.. 8850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!