Telangana: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. భద్రాద్రి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని లెక్కకట్టింది. చాలా ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరింత భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ రోజు మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో జులై నెలలో అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, చెన్నూర్, కోటపల్లి మండలాతో పాటు భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్, కాటారం, పలిమెల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో 7 జిల్లాల్లో అత్యధిక వానలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ లో 18.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. వేమనపల్లి మండలం నీల్వాయిలో 15, కోటపల్లిలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 20 ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం, 56 భారీ వర్షపాతం నమోదు అయింది. నిర్మల్ జిల్లా మామడ మండలం కిషన్ రావు పేట, ఖానాపురం మండలం రాజూరా గ్రామాల్లో చెరవులకు గండిపడింది. ముథోల్ మండలంలో పలు మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం, పలిమెల మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Read Also: Konaseema: అంబేద్కర్ ఫొటో వివాదం.. పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరసన
తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వానలతో గోదావరి, ప్రాణహిత ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద 49 అడుగులకు గోదావరి నీటమట్టం చేరింది. 11,39,230 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. దీంతో భద్రాద్రి వద్ద రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేసింది జిల్లా యంత్రాంగం.ఇల్లందు, కోయగూడెం ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి 12.9 మీటర్ల ఎత్తుకుచేరుకుని ప్రమాదకరంగా మారింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..