HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- రాష్ట్రవ్యాప్తంగా 6,092 కి.మీ రోడ్ల అభివృద్ధికి భారీ ప్లాన్
- హ్యామ్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి సుదీర్ఘ సమీక్ష
- బిటుమెన్ ధరలు డబుల్.. పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
- సీఎం రేవంత్తో కీలక చర్చల తర్వాత తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAM Projects : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారులను అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ (NHAI) , ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న హ్యామ్ మోడల్ వివరాలను మంత్రికి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవునా 34 ప్యాకేజీలుగా విభజించి ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమీక్షలో టెండర్ ప్రక్రియ , క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లపై మంత్రి అధికారులను ఆరా తీశారు.
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి గల కారణాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు , ఇతర ఆర్థిక కారణాల వల్ల రోడ్ల నిర్మాణంలో కీలకమైన బిటుమెన్ (తారు) ధర మెట్రిక్ టన్నుకు గతంలో ఉన్న రూ. 44 వేల నుంచి ఏకంగా రూ. 89 వేలకు పెరిగిందని, అంటే దాదాపు 100 శాతం మేర ధరల పెరుగుదల నమోదైందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు జీఎస్టీ అదనపు భారం , ఇతర నిర్వహణ ఖర్చులు కూడా ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెండర్ల ఎక్సెస్ శాతం తక్కువగానే ఉందని అధికారులు గణాంకాలతో సహా వెల్లడించారు. ఉదాహరణకు గుజరాత్లో 66 శాతం, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ నమోదవుతుండగా, మన రాష్ట్రంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు రూ. 4–5 లక్షల కోట్లతో 374కు పైగా ఇటువంటి హ్యామ్ ప్రాజెక్టులు సాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో కూడా నాణ్యమైన రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల వల్ల రహదారుల నిర్మాణమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా పక్కాగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. హ్యామ్ ప్రాజెక్టులకు సంబంధించిన తుది నిర్ణయాలు , ఇతర కీలక అంశాలపై రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్వయంగా చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఈ భారీ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!