HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- రాష్ట్రవ్యాప్తంగా 6,092 కి.మీ రోడ్ల అభివృద్ధికి భారీ ప్లాన్
- హ్యామ్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి సుదీర్ఘ సమీక్ష
- బిటుమెన్ ధరలు డబుల్.. పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
- సీఎం రేవంత్తో కీలక చర్చల తర్వాత తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAM Projects : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారులను అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ (NHAI) , ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న హ్యామ్ మోడల్ వివరాలను మంత్రికి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవునా 34 ప్యాకేజీలుగా విభజించి ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమీక్షలో టెండర్ ప్రక్రియ , క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లపై మంత్రి అధికారులను ఆరా తీశారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి గల కారణాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు , ఇతర ఆర్థిక కారణాల వల్ల రోడ్ల నిర్మాణంలో కీలకమైన బిటుమెన్ (తారు) ధర మెట్రిక్ టన్నుకు గతంలో ఉన్న రూ. 44 వేల నుంచి ఏకంగా రూ. 89 వేలకు పెరిగిందని, అంటే దాదాపు 100 శాతం మేర ధరల పెరుగుదల నమోదైందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు జీఎస్టీ అదనపు భారం , ఇతర నిర్వహణ ఖర్చులు కూడా ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెండర్ల ఎక్సెస్ శాతం తక్కువగానే ఉందని అధికారులు గణాంకాలతో సహా వెల్లడించారు. ఉదాహరణకు గుజరాత్లో 66 శాతం, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ నమోదవుతుండగా, మన రాష్ట్రంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు రూ. 4–5 లక్షల కోట్లతో 374కు పైగా ఇటువంటి హ్యామ్ ప్రాజెక్టులు సాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో కూడా నాణ్యమైన రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల వల్ల రహదారుల నిర్మాణమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా పక్కాగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. హ్యామ్ ప్రాజెక్టులకు సంబంధించిన తుది నిర్ణయాలు , ఇతర కీలక అంశాలపై రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్వయంగా చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఈ భారీ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
-
Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..