Rythu Bharosa: రికార్డు వేగంతో రైతు భరోసా.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6405 కోట్లు
- రికార్డు వేగంతో రైతు భరోసా..
- నాలుగు రోజుల్లోనే రూ.6405 కోట్లు..
- 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితాల ప్రకారం రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది. అయితే, 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. నాలుగు రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించింది. గురువారం సాయంత్రం నాటి వరకు రాష్ట్రంలో ఐదు ఎకరాల్లోపూ భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి.
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ఇక, ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం ఒక కోటి ఆరు లక్షల (1.06 కోట్లు) ఎకరాల భూములకు పెట్టుబడి సాయం అందింది. ఒక ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, రెండెకరాల లోపు 17.02 లక్షల మంది, మూడు ఎకరాల లోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ఢి పొందారు. వానాకాలం పంటలకు సరైన అదునులో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!