Rythu Bandhu : గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక, ఖాతాల్లోకి రైతు బంధు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గుడ్న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 28వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం.. ప్రతీ పంటకు ఎలాగైతే రైతు బంధు నిధులు విడుదల చేస్తామో.. అదే తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు. దీంతో.. ఈ నెల 28 నుంచి రైతుబంధు పథకం పెట్టుబడి సాయం నిధులు.. రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.. గుంట పొలం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అందిస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం వరుస క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.
Read Also: Maharashtra Political Crisis: మౌనం వీడిన ఉద్దవ్ థాక్రే.. రెండింటికీ రాజీనామాకు రెడీ..!
Also Read
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతీ ఏడాది రెండు సీజన్లకు పంట పెట్టుబడా సాయం అందిస్తుంది.. ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి విదితమే.. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరికొంత మంది రైతులు చేరారు.. ఇక, రైతుబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.. మరోవైపు, రైతు బంధుకు సంబంధించిన సొమ్మును ఎప్పటిలాగే ఈ వానాకాలం సీజన్లోనూ అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజే తెలిపారు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వ్యవసాయ శాఖ కాల్ సెంటర్కు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించడం, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!