Telangana Elections 2023: మహబూబాబాద్,వర్ధన్నపేట లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దయాకర్ రావు మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని హర్షం వ్యక్తం చేసారు. కాగా కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బి అర్ ఎస్ పార్టీ లో చేరనున్నారు.
Read also:Martin Luther King Review: మార్టిన్ లూథర్ కింగ్ రివ్యూ
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
అలానే వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోనూ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా లోని బట్టుపట్టి దగ్గర వర్ధన్నపెట్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. కాగా ముఖ్య మంత్రి సభ ఏర్పాట్లను ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో బట్టుపల్లి బైపాస్ రోడ్డు నుండి భారీ వాహనాల రాకపోకలను పోలీసులు అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అమలు పరచనున్నారు పోలీస్ అధికారులు. కాగా పాలేరు నుండి మహబూబాబాద్ కు ముఖ్యమంత్రి కేసీర్ విచ్చేయనున్నారు. రోజు మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య మంత్రి హాజరు కానున్నారు. అనంతరం 4 గంటలకు వర్ధన్నపేట లో నిర్వహిస్తున్న సభకు చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!