పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి
తెలంగాణ పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ ఫంక్షనల్ వర్టీకల్స్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డి.జి.పి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితుల అరెస్ట్, న్యాయస్థానాల ద్వారా అలాంటి వారికి శిక్షలు పడే విధంగా చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచడం, ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని డిజిపి తెలిపారు. రానున్న రోజులలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తదనంతర పరిమాణాలలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఈ సందర్భంగా డి.జి.పి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
-
Mrunal Thakur: ‘యల్లమ్మ’ మూవీలో హీరోయిన్ దొరికినట్టేనా..!
-
TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
-
West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
-
GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. ‘గాడ్ ఆఫ్ వార్’ వస్తున్నాడు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!