తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,187 శాంపిల్స్ పరీక్షించగా… 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు.
ఇదే సమయంలో 198 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,478 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,633 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,008 కు చేరినట్టు బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,837 యాక్టివ్ కేసులు ఉన్నాయి.