తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,505 శాంపిల్స్ పరీక్షచింగా.. కొత్తగా 244 మందికి పాజిటివ్గా తేంది.. మరో కరోనా బాధితుడు మృతిచెందగా… ఇదే సమయంలో 296 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,906కు చేరితే.. రికవరీ కేసుల సంఖ్య 6,55,061కు పెరిగింది. మరోవైపు.. ఇప్పటి వరకు 3,907 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.66 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు వెలుగుచూశాయి.