తెలంగాణలో ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,823 కి చేరింది. ఇందులో 4,74,899 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 50,969 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 27 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,955 కి చేరింది. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 658 కరోనా కేసులు నమోదయ్యాయి.