Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో మూడు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మదు సమస్యలపై ఆయన నాయకత్వంతో చర్చిస్తారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది ఉండగా.. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన 6 స్థానాల్లో డజనుకు పైగా సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
Read also: Sabarimala: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈ క్రమంలో ఈ ఆరు బెర్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిపై ఆసక్తిగా చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సోమవారం గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సంక్రాంతి తర్వాత లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, సోనియాగాంధీ పోటీ తదితర అంశాలపై సీఎం రేవంత్ అధిష్ఠానం చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం హోదాలో ఆయనను తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
PM Modi: ఓటమి నిరాశతో పార్లమెంట్కు అంతరాయం కలిగిస్తున్నారు: ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!