తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 869 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 08 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1197 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
read also :హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,24,379 కు చేరగా.. రికవరీ కేసులు 6,07,658 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,669 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,052 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 1,05, 123 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్.