Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్రెడ్డికి చోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీ బాస్. మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో నేడు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. పోటీ చేసేందుకు టిక్కెట్టు ఆశించి తనకు వెన్నుపోటు పొడిచిన కీలక వ్యక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.
Read also: Telangana Rain: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజులు వర్షాలే..
Also Read
- CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్కు ఉద్వాసన పలకడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ సమయంలో, గులాబి బాస్ ఆ స్ఠానాన్ని పూరించడానికి కొత్త స్కెచ్ను రూపొందించారు. అయితే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహేందర్రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సబితా రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంపై మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారతారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్ప టికే టికెట్ ఇవ్వక పోవడంతో మూడు నెలలుగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. ఇద్దరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారే కావడంతో.. ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడటంతో మహేందర్ రెడ్డికి చోటు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
Wednesday: బుధవారం రోజు తల స్నానం చేస్తున్నారా..? ఇది మీ కోసమే..
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..