Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్రెడ్డికి చోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీ బాస్. మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో నేడు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. పోటీ చేసేందుకు టిక్కెట్టు ఆశించి తనకు వెన్నుపోటు పొడిచిన కీలక వ్యక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.
Read also: Telangana Rain: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజులు వర్షాలే..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్కు ఉద్వాసన పలకడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ సమయంలో, గులాబి బాస్ ఆ స్ఠానాన్ని పూరించడానికి కొత్త స్కెచ్ను రూపొందించారు. అయితే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహేందర్రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సబితా రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంపై మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారతారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్ప టికే టికెట్ ఇవ్వక పోవడంతో మూడు నెలలుగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. ఇద్దరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారే కావడంతో.. ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడటంతో మహేందర్ రెడ్డికి చోటు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
Wednesday: బుధవారం రోజు తల స్నానం చేస్తున్నారా..? ఇది మీ కోసమే..
తాజావార్తలు
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!