Tarun Chugh On KCR: కుటుంబంలో ఒక్కో ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. వికారాబాద్ జిల్లా బీజేపీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో 420లు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ సునామీ రావడం ఖాయం… ఆపే వాళ్లు ఎవరూ లేరు. కేసీఆర్ ఆశలు గాలిలో మేడల్ల కూలిపోవడం ఖాయం అన్నారు.
బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా పోరాడాలి.. కేసీఆర్ను గద్దె దించాలి. అవినీతి కుటుంబ పాలనను ఓడించి అంతా కలిసి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడాలన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ విశ్వాస ఘాతుకం నుండి ప్రజలను కాపాడాలి. ప్రజాస్వామ్యయుతంగా కుటుంబ అవినీతి పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు గల్లీ గల్లీ, వార్డ్ వరకు , శక్తి కేంద్రం వరకు వెళ్లి అందరినీ సంఘటితం చేయాలి. బీజేపీ ఎలా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందో చెప్పాలి.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ప్రజలకు న్యాయం చేసేందుకు బీజేపీ అతి పెద్ద ఆందోళన చేపట్టబోతోంది. అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ సర్కార్ మోసం చేసింది. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని కేసీఆర్ చెప్పారు. ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం అన్నీ దక్కాయి. తెలంగాణ కోసం అనేక మంది యువకులు బలిధానం చేసుకున్నారు .. కానీ లబ్దిమాత్రం కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది.
లాఠీ దెబ్బలు యువకులు తింటే .. లబ్దిమాత్రం అమరికా నుండి వచ్చిన కేటీఆర్ కు దక్కింది. తెలంగాణ ఉద్యమంతో కనీసం సంబంధం లేని పదిమంది తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేకుండా చేసాడు. సర్కార్ లో ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్నాం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. పార్టీలో కనీసం స్వేచ్చగా గాలి పీల్చే పరిస్థితి లేదంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్.
తెలంగాణ అభివృద్ది కోసం కాదు.. రాష్ట్రంను దోచుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు పార్టీని విడిచి పెట్టాలని చూస్తున్నారు. ఏ గ్రామంలో సామాన్యుడిని అడిగినా ఇది దొంగ ప్రభుత్వం .. ప్రజల కలల పట్ల విశ్వాస ఘాతుకం చేసాడు అని చెబుతారు. తెలంగాణలో రైతులు, యువకులు, మహిళలు, దళితులు నారాజ్ లో ఉన్నారు.. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. మంత్రులపై ముఖ్యమంత్రి కిచెన్ క్యాబినెట్ పెత్తనం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరింత మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కో విభాగానికి ఒక్కో ముఖ్యమంత్రి ఉన్నారు.. వారంతా దోచుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు అని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!