Tammineni Veerabhadram: బీఆర్ఎస్తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే
Tammineni Veerabhadram Gives Clarity on Alliance With BRS Party: బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల అంశం ఇంకా చర్చించలేదని, సీట్ల విషయంలో జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు పాలేరు నుంచి పోటీ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయానికి తాము పొత్తుల విషయాన్ని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి బీజేపీ పార్టీ బలపడుతున్న మాట వాస్తవమేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనపడుతోందన్నారు. కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడుతోందని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సరైన ఆయుధం కాంగ్రెస్కు లేదన్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో బలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీని తెలంగాణలో ఎంట్రీ ఇవ్వకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ తాము చేస్తామన్నారు.
అంతకుముందు.. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా తాము బీఆర్ఎస్తో కలిసి పోరాడుతామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, ఇతర పార్టీలను తమ పార్టీలో కలుపుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను ఎండగట్టిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొల్పుతోందని.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ధీటుగా పోరాటాలు చేస్తున్నందుకే ఆయనతో కలిసి మునుగోడు ఉప ఎన్నికల్లో పని చేశామని తెలిపారు. భవిష్యత్లోనూ బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామన్నారు. తొలుత కేసీఆర్ ఏడేళ్లపాటు బీజేపీతో సఖ్యతతో ఉన్నారని.. కానీ ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ప్రధాని మోడీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపడుతున్నారని.. ఏపీ సీఎం జగన్పై కేసులు ఉండటంతో ఆయన మరీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
తాజావార్తలు
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
-
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!