Nizamabad College: మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ రూంలోనే ఉరివేసుకుని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad College: కాకతీయ మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నిజామాబాద్ లోని ఓ మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రీతి ఘటనపై అసలు ఏం జరుగుతోంది అనే ఒక కేసును ఛేదించే పనిలో వున్న పోలీసులకు మోడికో విద్యార్థి దాసరి హర్ష ఆత్మహత్య పోలీసులకు సవాల్ గా మారింది.
Read also: Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్.. విషాదంగా క్లైమాక్స్
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ లో మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ హర్ష తన రూం ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో షాక్ తిన్న విద్యార్థులు యాజమాన్యానికి సమచారం అందించారు. యాజమాన్యం ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా గుర్తించారు. అయితే తన కన్న కొడుకు ఆత్మహత్యపై హర్ష కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హర్ష అంత పిరికివాడు కాదని తన కొడుకు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపాలు. అసలు కాలేజీ ఏం జరిగింది. హాస్టల్లో ఏమైనా గొడవ జరిగిందా లేక ఇంకా ఏమైనా కారణాలు వున్నాయా? అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read also: Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
అయితే కాకతీయ మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక.. సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో.. సైఫ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక శుక్రవారం సైఫ్ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్ను ఖమ్మం జైలుకు తరలించారు. ఇక మరోవైపు ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. మెడికో ప్రీతికి ఎక్మో ద్వారా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.
Complaints to GHMC: కుక్కలు బాబోయ్ కుక్కలు.. జీహెచ్ఎంసీకి 36 గంటల్లో 15వేల కంప్లైంట్స్
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!