Nizamabad College: మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ రూంలోనే ఉరివేసుకుని
Nizamabad College: కాకతీయ మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నిజామాబాద్ లోని ఓ మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రీతి ఘటనపై అసలు ఏం జరుగుతోంది అనే ఒక కేసును ఛేదించే పనిలో వున్న పోలీసులకు మోడికో విద్యార్థి దాసరి హర్ష ఆత్మహత్య పోలీసులకు సవాల్ గా మారింది.
Read also: Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్.. విషాదంగా క్లైమాక్స్
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ లో మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ హర్ష తన రూం ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో షాక్ తిన్న విద్యార్థులు యాజమాన్యానికి సమచారం అందించారు. యాజమాన్యం ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా గుర్తించారు. అయితే తన కన్న కొడుకు ఆత్మహత్యపై హర్ష కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హర్ష అంత పిరికివాడు కాదని తన కొడుకు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపాలు. అసలు కాలేజీ ఏం జరిగింది. హాస్టల్లో ఏమైనా గొడవ జరిగిందా లేక ఇంకా ఏమైనా కారణాలు వున్నాయా? అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read also: Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
అయితే కాకతీయ మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక.. సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో.. సైఫ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక శుక్రవారం సైఫ్ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్ను ఖమ్మం జైలుకు తరలించారు. ఇక మరోవైపు ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. మెడికో ప్రీతికి ఎక్మో ద్వారా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.
Complaints to GHMC: కుక్కలు బాబోయ్ కుక్కలు.. జీహెచ్ఎంసీకి 36 గంటల్లో 15వేల కంప్లైంట్స్
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో