Indian Railways: రైళ్లపై రాళ్లు విసిరతే ఐదేళ్ల జైలుశిక్ష.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: ఇటీవల వందేభారత్ రైళ్లపై దాడులు ఎక్కువయ్యాయి. దేశంలోనే కాకుండా పలు ప్రాంతాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైలుపై అనేక దాడులు జరిగాయి. వందేభారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు వాటిని మార్చాల్సి వచ్చింది. దీంతో రైలును నిలిపివేయాల్సి రావడంతో ట్రాఫిక్కు కూడా అంతరాయం ఏర్పడింది. వందేభారత్ రైలుపై వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే దాడికి పాల్పడిన వారిని హెచ్చరించారు. రైళ్లపై దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కాజీపేట-ఖమ్మం, కాజీపేట-బొంగిర్, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక సెక్షన్లలో వందేభారత్ రైళ్లపై దాడులు… ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 9 రైళ్లపై దాడులు జరిగాయి.
Read also: Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..!
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఈ ఘటనల్లో 39 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జనవరి నుంచి జరిగిన దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా.. వందే భారత్ రైళ్లపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాగా.. ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు ఖమ్మం, రాజమండ్రి, ఏలూరు, కాజీపేట్, భువనగిరిలో ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది. జనవరి 11న విశాఖపట్నం సమీపంలో కొందరు రాళ్లు రువ్వారు. ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలో దాడి జరిగింది. విశాఖ జిల్లా కంచరపాలెంలో ఒకసారి వందేభారత్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. జనవరిలో సంక్రాంతి సందర్భంగా వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వందేభారత్ రాకతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.
foods to beat the heat: వేడిని అధిగమించడానికి ఈ ఆహారాలు తినండి
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!