Indian Railways: రైళ్లపై రాళ్లు విసిరతే ఐదేళ్ల జైలుశిక్ష.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: ఇటీవల వందేభారత్ రైళ్లపై దాడులు ఎక్కువయ్యాయి. దేశంలోనే కాకుండా పలు ప్రాంతాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైలుపై అనేక దాడులు జరిగాయి. వందేభారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు వాటిని మార్చాల్సి వచ్చింది. దీంతో రైలును నిలిపివేయాల్సి రావడంతో ట్రాఫిక్కు కూడా అంతరాయం ఏర్పడింది. వందేభారత్ రైలుపై వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే దాడికి పాల్పడిన వారిని హెచ్చరించారు. రైళ్లపై దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కాజీపేట-ఖమ్మం, కాజీపేట-బొంగిర్, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక సెక్షన్లలో వందేభారత్ రైళ్లపై దాడులు… ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 9 రైళ్లపై దాడులు జరిగాయి.
Read also: Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..!
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ఈ ఘటనల్లో 39 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జనవరి నుంచి జరిగిన దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా.. వందే భారత్ రైళ్లపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాగా.. ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు ఖమ్మం, రాజమండ్రి, ఏలూరు, కాజీపేట్, భువనగిరిలో ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది. జనవరి 11న విశాఖపట్నం సమీపంలో కొందరు రాళ్లు రువ్వారు. ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలో దాడి జరిగింది. విశాఖ జిల్లా కంచరపాలెంలో ఒకసారి వందేభారత్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. జనవరిలో సంక్రాంతి సందర్భంగా వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వందేభారత్ రాకతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.
foods to beat the heat: వేడిని అధిగమించడానికి ఈ ఆహారాలు తినండి
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!