D. Sridhar Babu: చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్
- చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదు..
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తం..
- ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉంది..
- బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటుంది...
- ప్రభుత్వం తరుపున 2.50 లక్షలు-రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Sridhar Babu: చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు.
Read also: Pushpa 2 : పోస్ట్ పోన్ కి కారణం అదేనా..?
Also Read
ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని రైస్ మిల్లు యజమానులు పనిలోకి తీసుకోవాలన్నారు. గంజాయి,డ్రగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటుందన్నారు. ప్రభుత్వం తరుపున 2.50 లక్షల, రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇల్లు, ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Read also: Happy Fathers Day: నాన్న మాటల్లో ప్రేమ.. కోపంలో బాధ్యత.. అణుక్షణం బిడ్డ గురించే ఆలోచన..
మరోవైపు సీతక్క మాట్లాడుతూ.. ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, దీనికి కారణం గంజాయి,డ్రగ్స్ అన్నారు. మత్తుకు అలవాటు పడి వావి-వరస అనే తేడా లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం,హత్య చేసిన ఘటన చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరియస్ గా తీసుకుందని తెలిపారు. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చెయ్యాలన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందన్నారు. గంజాయి రహిత,డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటుందని తెలిపారు.
Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్ రెడ్డి సీరియస్
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..