Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్ రెడ్డి సీరియస్
- విద్యుత్ కొనుగోళ్లలో నష్టం లేదు- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
- గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరం ఏంటి
- కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదు
- విచారణ చేపట్టకముందే కమిషన్ తీర్పు ఇస్తారా?
- కమిషన్ను- విచారణను వ్యతిరేకించడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో నష్టం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనూ ప్రస్తుత ప్రభుత్వ నాయకులు అభ్యంతరాలు చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజే తమ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగారు. గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. విచారణ చేపట్టకముందే కమిషన్ తీర్పు చెప్పినట్లు వ్యవహరించిందని సీరియస్ అయింది. జస్టిస్ నరసింహారెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. కమిషన్ చైర్మన్ కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఏ కమీషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించదని చెప్పారు. కమిషన్ను, విచారణను తాము వ్యతిరేకించడం లేదన్నారు. గతంలో కమీషన్లు రాకుండా అడ్డుకున్న ఘటనలు ఉన్నాయన్నారు.
Read also: Traffic Restrictions: అలర్ట్… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
కాగా.. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్కు కమిషన్ నోటిస్ జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్కు 12 పేజీల లేఖ కేసీఆర్ రాశారు.
Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్.. వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!