Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్ రెడ్డి సీరియస్
- విద్యుత్ కొనుగోళ్లలో నష్టం లేదు- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
- గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరం ఏంటి
- కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదు
- విచారణ చేపట్టకముందే కమిషన్ తీర్పు ఇస్తారా?
- కమిషన్ను- విచారణను వ్యతిరేకించడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో నష్టం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనూ ప్రస్తుత ప్రభుత్వ నాయకులు అభ్యంతరాలు చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజే తమ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగారు. గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. విచారణ చేపట్టకముందే కమిషన్ తీర్పు చెప్పినట్లు వ్యవహరించిందని సీరియస్ అయింది. జస్టిస్ నరసింహారెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. కమిషన్ చైర్మన్ కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఏ కమీషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించదని చెప్పారు. కమిషన్ను, విచారణను తాము వ్యతిరేకించడం లేదన్నారు. గతంలో కమీషన్లు రాకుండా అడ్డుకున్న ఘటనలు ఉన్నాయన్నారు.
Read also: Traffic Restrictions: అలర్ట్… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కాగా.. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్కు కమిషన్ నోటిస్ జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్కు 12 పేజీల లేఖ కేసీఆర్ రాశారు.
Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్.. వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!