Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Soyam Bapurao Demands Fecilities In Iiit Basara

Soyam Bapurao: ఇదేం ట్రిపుల్ ఐటీ…? ఏంటీ దుస్థితి?

Published Date :March 27, 2022 , 3:19 pm
By NTV WebDesk
Soyam Bapurao: ఇదేం ట్రిపుల్ ఐటీ…? ఏంటీ దుస్థితి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ట్రిపుల్ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ లేరు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు.

ల్యాబ్ అసిస్టెంట్ తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొంది. వేలాది మంది విద్యార్థులన్న ఈ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ కొనసాగుతుండటం ఆశ్చర్యమేస్తోంది. విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాల్లేవు. రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్నారు. ఫ్యాన్లు లేవు. ఏసీ పని చేయడం లేదు. కుర్చీలు డిజిటల్ బోర్డ్స్, డెస్క్ లన్నీ చెడిపోయాయి. ప్రొజెక్టర్ అసలు పనిచేయడం లేదన్నారు.

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • TIMS Sanathnagar: సనత్‌నగర్‌ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం..!

మండుటెండలో రేకుల షెడ్లలో ఫ్యాన్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడిపోతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడం లేదు. కనీసం యూనిఫాం, షూ, ఐడీ కార్డులు కూడా ఇవ్వడం లేదంటే ట్రిపుల్ ఐటీ ఎంతటి దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక హాస్టల్ లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. వాడిపారేసిన పాత పరుపులే దిక్కు. 9 వేల మంది విద్యార్థులకు మూడు మెస్ లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అత్యంత దరిద్రంగా మారాయి.

వేలాది మంది పిల్లలు ఒకేసారి భోజనం చేయాల్సి రావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారింది. చదువుకునే వారంతా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం వారేకదా వాళ్లు ఏ భోజనం పెట్టినా అడిగే వారెవరు ఉండరనే నిర్లక్ష్యం మెస్ నిర్వాహకుల్లో కన్పిస్తోందన్నారు. అందుకే వారు వడ్డించే భోజనంలో తెల్ల పురుగులు, కప్పలు కన్పించడం నిత్యకృత్యంగా మారిందన్నారు.

తాగడానికి మంచి నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. పురాతనమైన వాటర్ ఫిల్టర్ నిర్వహణ కూడా సరిగా లేదు. హాస్టల్ లో శుభ్రత కరువైంది. దోమలు, ఈగలు, పురుగులతోనే విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ఫీజుల ద్వారా ఏటా 40 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నా విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం.

ట్రిపుల్ ఐటీ దుస్థితిని చూస్తుంటే వేలాది మంది విద్యార్థులు భవిష్యత్ ఏమవుతుందోననే ఆవేదన కలుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించరానిది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రెగ్యులర్ వీసీ, డైరెక్టర్ తోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు ఎంపీ సోయం బాపూరావు.

https://ntvtelugu.com/mystery-deaths-in-bhadradri-kothagudem-district/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad
  • bjp mp
  • Food
  • iiit basara
  • low quality food

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions