Dasara Festival: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasara Festival: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరాకు స్వస్థలాలకు వెళతారు. కానీ చాలా మంది సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కానీ పండుగ హడావుడి వల్ల సీట్లు దొరకడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా 620 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దసరా పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి సహా పలు ప్రాంతాలకు ప్రయాణికులు విపరీతంగా రాకపోకలు సాగిస్తుంటారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. షిర్డీ, జైపూర్, రామేశ్వరం మరియు ఇతర ప్రధాన రద్దీ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబరు 19 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.అక్టోబర్ 20-29 మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, రెండు రూట్లలో సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లు. ఇక మరోవైపు ప్రయాణికుల అభ్యర్థనల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ కాకుండా జేబీఎస్ ద్వారా నడపాలని బీహెచ్ఈఎల్ నిర్ణయించింది. కేపీహెచ్బీ కాలనీ, బాలానగర్, బోయిన్పల్లి, జేబీఎస్, సంగీత్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఆ మార్గంలో సర్వీసులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.
Bhagavanth Kesari: 48 గంటల్లో బాలయ్య హ్యాట్రిక్ కి పునాది
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!