అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. పక్కా రెక్కీ, పక్క స్కెచ్ ప్రకారమే యశ్వంత్, జ్యోతిల హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొత్తగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ పలుసార్లు వచ్చినట్టు గుర్తించారని.. అయితే ఇద్దరినీ గతంలో జ్యోతి భర్త శ్రీనివాస్ రావు ఫాలో అయ్యాడు. ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుండి యశ్వంత్ ను ఫాలో అయిన శ్రీనివాస్ రావు.. అప్పటికే సుపారీ గ్యాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు.
భార్య ప్రవర్తనతో ఇద్దరిపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ రావు.. యశ్వంత్, జ్యోతి నగ్నంగా వున్న సమయంలో.. ఇద్దరినీ చుట్టుముట్టి భర్త, మరో నలుగురు హత్య చేశారు. అయితే.. జ్యోతి కళ్ళ ముందే యశ్వంత్ దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత.. కాళ్లా.. వేళ్లా పడి బతిమాలినా.. జ్యోతిని సైతం హత్య చేశారు. షాపింగ్ మాల్ రసీదు ఆధారంగా కేసు చిక్కుముడి వీడింది. పోలీస్ల అదుపులో నిందితులు ఉన్నట్టు సమాచారం.