CM Revanth Reddy : SLBC పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్లైన్
- ఎస్ఎల్బీసీ పనుల్లో ఆలస్యం సహించబోమన్న సీఎం రేవంత్
- 2027 డిసెంబర్ 9 నాటికి ప్రజలకు అంకితం చేయనున్న ఎస్ఎల్బీసీ
- సొరంగం పనులకు జేపీ అసోసియేట్స్ సిద్ధం కావాలని ఆదేశం
- గ్రీన్ ఛానల్లో నిధుల సమకూర్చనున్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ) పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, డిసెంబర్ 9, 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లా అవసరాలకే కాకుండా మొత్తం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమని, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా నీటిని అందించే అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ పూర్తిని ఏ విధంగానూ వాయిదా వేయరాదని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు.
China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సీఎం, అటవీ శాఖ అనుమతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్ఎల్బీసీ పనులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లోనే నిధులు అందజేస్తుందని హామీ ఇస్తూ, పనుల్లో అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు.
సొరంగం పనులను చేపట్టే కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను వెంటనే సిద్ధం చేసుకోవాలని, ఒక్కరోజు ఆలస్యం జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగిపోకుండా చూడాలని హెచ్చరించారు. డిసెంబర్ 9, 2027 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తుది గడువుగా ప్రకటించారు.
US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్పింగ్” ఫోటో..
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!