Congress vs BRS Clash: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన BRS పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి తీవ్ర నష్టం జరిగిందని దానికి కారణం BRS పార్టీయేనని ఆరోపణలు చేశారు.
Read Also: Delhi Shocking: గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
ఇక, మాజీ మంత్రి హరీష్ రావు మా కాలనీల్లో ప్రచారానికి రావొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా BRS పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే, మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో BRS, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరికి మరొకరు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.