Delhi Shocking: గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
- ఢిల్లీ షాకింగ్ కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
- చర్యలకు సిద్ధపడిన ఢిల్లీ పోలీసులు
- బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో గుంతలో పడి మరణించిన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనక్పురిలో నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. బారికేడ్లు లేకుండా.. సైన్ బోర్డులు.. లైటింగ్ లేకుండా వదిలేశారు. కనీసం భద్రతగా సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టలేదు. దీంతో కమల్ ధ్యాని అనే యువకుడు గుంతలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై మేయర్గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్గా సంజయ్ ఘడి ఎన్నిక
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
అయితే ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని జనక్పురిలో 25 ఏళ్ల కమల్ ధ్యాని బైక్తో పాటు గుంతలో పడిపోవడాన్ని ఒక కుటుంబం చూసింది. వెంటనే టెంట్లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. ఆ గార్డ్ వెంటనే సబ్ కాంట్రాక్టర్ రాజేష్ ప్రజాపతికి సమాచారం అందించాడు. వెంటనే వచ్చి ఒక వ్యక్తి.. బైక్తో పాటు గుంతలో ఉన్నట్లు చూశాడు. కానీ రక్షించే ప్రయత్నం చేయలేదు. చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… రాజేష్తో పాటు సహా బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. రాజేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు.
స్థానికుల ఆందోళన
ప్రమాద స్థలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
Shocking !!!
सड़क में गहरे गड्ढे में एक मासूम बाइक सवार गिर कर फँस गया, रात भर पड़ा रहा और मर गया
नोएडा की घटना से दिल्ली की भाजपा सरकार ने कुछ नहीं सीखा। बस रोज़ झूठ बोला जाता है।
जनकपुरी डिस्ट्रिक्ट सेंटर, दिल्ली pic.twitter.com/4WJr1tLdiI
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 6, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!