Chada Venkat Reddy: ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తుంది..
- ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను అంతం చేయడం మంచి పరిణామం..
- ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తుంది..
- నక్సలైట్లతో ప్రధాని మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలి: చాడ వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chada Venkat Reddy: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సీపీఐ మండల మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచశాంతికి శుభ పరిణామం అన్నారు. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణి వైఖరితో కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం అన్నారు. ఇప్పటికే వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధం.. అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.. వామపక్ష పార్టీలన్నీ ఖగర్ ఆపరేషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి.. నక్సలైట్లతో ప్రధాని మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలి అని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)
Also Read
అయితే, కొత్త ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఇప్పుడు కొనసాగుతున్న హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి భవనాన్ని కూల్చివేయద్దు అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయాన్ని గౌరవెల్లి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ పూర్తి చేయలేదు అని ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెండేళ్లు గడుస్తున్నప్పటికీ 437 కోట్ల రూపాయలు తీసుకువచ్చాను అంటున్నాడు కానీ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కావడం లేదని విమర్శలు గుప్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్ తో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!