Telangana Rains : వర్ష బీభత్సం.. రేపు, ఎల్లుండి స్కూల్స్ బంద్
- కోమటిచెరువు నాలా ఉప్పొంగి జగదిగ్బంధంలో సిద్దిపేట
- వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
- కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవు
- భారీ వర్షాల దృష్ట్యా సెలవులు పొడిగించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains : సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల విద్యార్థులకు రేపు, ఎల్లుండి పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.
Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపై నుంచి నీరు ఉద్ధృతంగా పారుతుండగా, పలు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించే చర్యలు చేపట్టారు.
ఇక భారీ వరద నీరు చేరడంతో సిద్దిపేటలోని కోమటి చెరువు నిండుకుండలా మారింది. చెరువు మత్తడి పారిపోవడంతో పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, ఆగస్టు 28 నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు మళ్లీ వర్ష బీభత్సాన్ని ఎదుర్కొనే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది.
TCS Bengaluru Lease Deal: అద్దె రూ.2,130 కోట్లు.. టీఎసీఎస్ నయా రికార్డ్..
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?