Kazipet: స్టేషన్లో చెప్పు జారిపోయిందని ప్రయాణికుడి ట్వీట్.. రికవరీ చేసిచ్చిన రైల్వే అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ఎక్కేటప్పుడు చెప్పులు జారిపోవడం కామన్ గా ట్రైన్ ప్రయాణికులు ప్రతీ ఒక్కరికి ఇది అనుభవమని ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణం అంతా చిరాకుతో గడవడం.. గమ్యస్థానానిక చేరిన తర్వాత ముందుగా ఏ చెప్పుల షాపు కనబడితే అందులోకి దూరి ఏదో ఒక చెప్పులు కొనుక్కుని ఆ తర్వాత ముందుకు సాగుతుంటారు. కానీ కాజీపేట రైల్వే పోలీసులు మాత్రం అలాంటి ఇబ్బంది అవసరం లేదంటున్నారు. రైలు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి చెప్పును తిరిగి అందించి.. తమ పనితీరును చాటుకున్నారు. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. బంగారం పోతేనే రికవరీ చేయడం కష్టమైన ఈ రోజుల్లో.. చెప్పును రికవరీ చేశారని తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Ram Charan: గేమ్ చేంజర్ 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందా? కారణం అతనేనా?
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. శనివారం జనగామ జిల్లా చిలుకూరు పల్లగుట్టకు చెందిన రాజేశ్ అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లాలనుకున్నాడు. దీనికోసం స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుండడంతో.. కదులుతున్ రైలు ఎక్కబోయాడు.. రైలు అయితే ఎక్కగలిగాడు.. కానీ అతడి కాలికున్న చెప్పు ఒకటి జారి పట్టాల మధ్యలో పడిపోయింది. అది అతడిని బాధించింది. ఎంతో ఇష్టపడి కొనుకున్న చెప్పులు అలా జారిపోవడంతో.. రైల్వే అధికారులకు నాకు చాలా ఇష్టమైన చెప్పులు అవి కొత్తవి జారిపోయాయి..అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత్ స్పందించారు. వెంటనే చెప్పును రికవరీ చేయాల్సిందిగా కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : Corona Vaccine: కరోనా టీకా వికటించి ఆస్పత్రుల్లో వారిలో తెలంగాణ సెకండ్..
ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆ విద్యార్థి చెప్పును రికవరీ చేశాడు.. ఆ తర్వాత ఆదివారం నాటు కాజీపేటకు తీసుకువచ్చి రాజేశ్ కి అప్పగించారు. సో.. ఈ సారి రైలు ఎక్కుతుంటే చెప్పులు జారిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు.. రైల్వే అధికారులకు ఓ ట్వీట్ చేస్తే చాలు పోయేదేముందు వస్తే.. చెప్పు తిరిగి వస్తుందని సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!