Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..
- చికెన్ ప్రియులకు బిగ్ షాక్..
- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు..
- కిలో చికెన్ ప్రస్తుతం రూ.400 వరకు పలుకుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంచంలో చికెన్ ముక్క కనిపించడం కాస్త భారంగానే మారేలా ఉంది. ఆదివారానికి ఒక్క రోజు ముందుగానే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కిలో రూ.330 పలికిన చికెన్, ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు పెరిగి సామాన్యుడి బడ్జెట్కు చిల్లు పెడుతోంది.
ప్రస్తుతం విజయవాడలో స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది; ఇక్కడ కిలో ధర రూ.340 నుంచి రూ.350 మధ్యలో ఉంది. ఇక నాటుకోడి విషయానికి వస్తే, ధరలు వింటేనే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. కేజీ బరువుండే నాటుకోడి ధర సుమారు రూ.800 మార్కును తాకింది. చికెన్ రేట్లు ఇలాగే పెరిగితే, త్వరలోనే అర కిలో మటన్ ధరతో ఇది పోటీ పడటం ఖాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read:Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..
అకాల ఎండల వల్ల పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల మార్కెట్లోకి రావాల్సిన స్టాక్ తగ్గి, డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో డిమాండ్ రెట్టింపు అయ్యింది. డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా (Feed) ధరలు కూడా అధికం కావడంతో పౌల్ట్రీ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచాల్సి వస్తోంది.
చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకోవడంతో.. చాలామంది ఇప్పుడు చేపలు, రొయ్యలు వంటి సీ-ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్తో పోలిస్తే చేపల ధరలు కొంత అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. ఎండలు తగ్గుముఖం పట్టే వరకు లేదా కోళ్ల ఉత్పత్తి పెరిగే వరకు ఈ ధరల నుంచి ఉపశమనం లభించడం కష్టమే.
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!