Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..
- చికెన్ ప్రియులకు బిగ్ షాక్..
- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు..
- కిలో చికెన్ ప్రస్తుతం రూ.400 వరకు పలుకుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంచంలో చికెన్ ముక్క కనిపించడం కాస్త భారంగానే మారేలా ఉంది. ఆదివారానికి ఒక్క రోజు ముందుగానే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కిలో రూ.330 పలికిన చికెన్, ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు పెరిగి సామాన్యుడి బడ్జెట్కు చిల్లు పెడుతోంది.
ప్రస్తుతం విజయవాడలో స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది; ఇక్కడ కిలో ధర రూ.340 నుంచి రూ.350 మధ్యలో ఉంది. ఇక నాటుకోడి విషయానికి వస్తే, ధరలు వింటేనే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. కేజీ బరువుండే నాటుకోడి ధర సుమారు రూ.800 మార్కును తాకింది. చికెన్ రేట్లు ఇలాగే పెరిగితే, త్వరలోనే అర కిలో మటన్ ధరతో ఇది పోటీ పడటం ఖాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Also Read:Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..
అకాల ఎండల వల్ల పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల మార్కెట్లోకి రావాల్సిన స్టాక్ తగ్గి, డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో డిమాండ్ రెట్టింపు అయ్యింది. డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా (Feed) ధరలు కూడా అధికం కావడంతో పౌల్ట్రీ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచాల్సి వస్తోంది.
చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకోవడంతో.. చాలామంది ఇప్పుడు చేపలు, రొయ్యలు వంటి సీ-ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్తో పోలిస్తే చేపల ధరలు కొంత అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. ఎండలు తగ్గుముఖం పట్టే వరకు లేదా కోళ్ల ఉత్పత్తి పెరిగే వరకు ఈ ధరల నుంచి ఉపశమనం లభించడం కష్టమే.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!