Moinabad Drugs Case Twist: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. SIT దర్యాప్తులో కొత్త నిజాలు బట్ట బయలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moinabad Drugs Case Twist: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులకి నుంచి కీలక వివరాలు రాబట్టింది ప్రత్యేక బృందం (SIT). అయితే ఈ ముగ్గురు నిందుతులని కస్టడీలోకి తీసుకొని మరింత ప్రశ్నించాలని భావిస్తోంది బృందం. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం రాబట్టే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిమగ్నమైంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. వారి నుంచి పలు ముఖ్యమైన విషయాలు రాబట్టింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరి ద్వారా వచ్చాయి..? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడింది సిట్.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
డ్రగ్స్ కేసులో కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, శరత్ లను సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై ఆరా తీసింది. దీంతో కౌశిక్ రవి తనకు డ్రగ్స్ ఇచ్చాడని స్టేట్మెంట్ ఇచ్చారు శరత్. అలాగే డ్రగ్స్ ను సిమ్లా నుంచి తీసుకొచ్చానని కౌశిక్ రవి చెప్పినట్లు తెలుస్తుంది. కానీ దర్యాప్తులో మాత్రం హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేయాలనే నిర్ణయానికి వచ్చింది సిట్. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ పై పోలీసులు రైట్ చేసినప్పుడు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని సిట్ ఆరాస్తోంది.
Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
ఈ కేసులో నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరించాలని నిర్ణయించింది సిట్ దీనిలో భాగంగా ముగ్గురిని 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని ప్రశ్నించాలని భావిస్తోంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేగా విచారణ జరిగింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది రాజేంద్రనగర్ కోర్టు. మరోవైపు డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి వివరణ ఇచ్చారు ఏలూరు ఎంపి పుట్టా మహేష్. మరో ఐదు రోజుల్లో సమాధానం ఇవ్వాలన్న నోటీస్ గడువు ముగుస్తున్న తరుణంలో సమాధానం ఇచ్చారు ఆయన. ఈ వివరణను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకొనింది టీడీపీ అధినాయకత్వం. మొత్తానికి మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కేసు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!