Shabbir Ali: కేసీఆర్ కమీషన్ల పనులు తప్ప.. పేదలకు ఉపయోగపడేవి చేశాడా? షబ్బీర్ అలీ ఫైర్
Shabbir Ali: కమీషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని కంటేశ్వర్ లో గల 19, 20వ డివిజన్లలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజల బలహీనతలతో ఆడుకునే అలవాటు బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు బలి తీసుకున్నారని తెలిపారు. కాని లబ్ధిమాత్రం కేసిఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పొందారని కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రాజభోగాలు ఏలుతుందని అన్నారు. ఎమ్మెల్యే నగరంలోని వనరులన్నీ దోచేసి ప్రజలను పట్టించుకోకుండా భూ బకాసురుడిలా పేదల భూములు లాక్కుంటున్నాడని తెలిపారు. కమిషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని అన్నారు.
Read also: Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
Also Read
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
నిజామాబాద్ పట్టణం అభివృద్ధిలో 15 సంవత్సరాలు వెనక వెళ్లిపోయిందని తెలిపారు. పట్టణంలో ఎక్కడ చూసినా శాశ్వత అభివృద్ధి జరగలేదన్నారు. పేదలను పేదలుగానే ఉంచి వారికి పెన్షన్లు ఇచ్చి వారిని దాంతోనే సంతృప్తి పరిచారని మండిపడ్డారు. పెన్షన్ ఈ చేతితో ఇచ్చి నిత్యవసరాల సరుకుల ధరలు పెంచి వంటగ్యాస్ ధర 1200 చేసి లూటీ చేశారని అన్నారు. వారికి శాశ్వతంగా వారి ఆర్థిక పరిస్థితులు పెరిగే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. విద్యా, ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు తీసుకురాలేదని మండిపడ్డారు. కాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలతో ఇంటింటికి పోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ తన 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇళ్లు కట్టించి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తమ పార్టీ ఆరు గ్యారెంటి హామీలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే మెనిపెస్టు, బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్ తో ముందుకు వెళుతున్నామని అన్నారు. తను లోకల్ లో వుంటూ ప్రజలకు అందుబాటులో వుంటానని అన్నారు.
Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
తాజావార్తలు
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!