Shabbir Ali: కేసీఆర్ కమీషన్ల పనులు తప్ప.. పేదలకు ఉపయోగపడేవి చేశాడా? షబ్బీర్ అలీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali: కమీషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని కంటేశ్వర్ లో గల 19, 20వ డివిజన్లలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజల బలహీనతలతో ఆడుకునే అలవాటు బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు బలి తీసుకున్నారని తెలిపారు. కాని లబ్ధిమాత్రం కేసిఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పొందారని కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రాజభోగాలు ఏలుతుందని అన్నారు. ఎమ్మెల్యే నగరంలోని వనరులన్నీ దోచేసి ప్రజలను పట్టించుకోకుండా భూ బకాసురుడిలా పేదల భూములు లాక్కుంటున్నాడని తెలిపారు. కమిషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని అన్నారు.
Read also: Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
నిజామాబాద్ పట్టణం అభివృద్ధిలో 15 సంవత్సరాలు వెనక వెళ్లిపోయిందని తెలిపారు. పట్టణంలో ఎక్కడ చూసినా శాశ్వత అభివృద్ధి జరగలేదన్నారు. పేదలను పేదలుగానే ఉంచి వారికి పెన్షన్లు ఇచ్చి వారిని దాంతోనే సంతృప్తి పరిచారని మండిపడ్డారు. పెన్షన్ ఈ చేతితో ఇచ్చి నిత్యవసరాల సరుకుల ధరలు పెంచి వంటగ్యాస్ ధర 1200 చేసి లూటీ చేశారని అన్నారు. వారికి శాశ్వతంగా వారి ఆర్థిక పరిస్థితులు పెరిగే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. విద్యా, ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు తీసుకురాలేదని మండిపడ్డారు. కాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలతో ఇంటింటికి పోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ తన 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇళ్లు కట్టించి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తమ పార్టీ ఆరు గ్యారెంటి హామీలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే మెనిపెస్టు, బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్ తో ముందుకు వెళుతున్నామని అన్నారు. తను లోకల్ లో వుంటూ ప్రజలకు అందుబాటులో వుంటానని అన్నారు.
Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!