September 17: అత్యంత కీలక రోజుగా ‘సెప్టెంబర్ 17’.. అప్రమత్తమైన నగర పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
September 17: అత్యంత కీలకమైన రోజుగా మారిన ‘సెప్టెంబర్ 17’ నేపథ్యంలో నగర పోలీసు శాఖ అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం నుంచి నగరంలోకి రానున్నారు. ఆదివారం బోయిన్పల్లిలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి ఎదిగిన సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Read also: Women Success Story : బెండకాయలతో మహిళ వ్యాపారం.. ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు శాఖ గతంలో మాదిరిగా పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరేడ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్స్ మధ్య ట్రాఫిక్ మళ్లింపు విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్ ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు మోహరింపులో పాల్గొంటున్నాయి. రెండు చోట్లా మొత్తం 2500 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని నగరవాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జేబీఎస్లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి ముందే వెళ్లిపోవాలని పోలీసులు కోరారు.
Mammu Kaka: ‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి చేసిన మమ్ముట్టి
తాజావార్తలు
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!