Jublee Hills Case : కస్టడీ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మొదటి రోజు విచారణ ముగిసింది. అయితే పోలీసుల కస్టడీ విచారణ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారించారు. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై ఒకరు నెట్టుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గ్యాంగ్ రేప్ కేసులో తమ తప్పు ఏమి లేదంటున్న మైనర్లు వెల్లడించారని, తమను సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టాడని చెప్తున్న మైనర్లు తెలిపారు.
నాకంటే ముందు మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించింది మైనర్ లే అని సాదుద్దీన్ తెలిపినట్లు, బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే తనయుడు అసభ్యంగా ప్రవర్తించారని, అనంతరం మేము అనుసరించామని స్టేట్ మెంట్. కాన్స్ బేకరి నుండి మార్గం మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడని తమతో రాలేదని తెలిపారు. బెంజ్ కార్ కాన్స్ బేకరిలో పార్క్ చేసి ఇన్నోవాలో ఐదుగురం వెళ్ళామని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా ఎస్కేప్ అయ్యామని, ఎక్కడకు ఎస్కేప్ అవుతున్నాము అన్న విషయం ముందుగా డిసైడ్ కాలేదు ఆని అని తెలిపారు. పోలీసుల కస్టడీకి విచారణలో పాతబస్తీకి చెందిన ఓ ఛానల్ సీఈఓ కొడుకు మైనర్ ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో పోలీసులు మొదటి రోజు గంట పాటు విచారణ చేశారు. మరికాసేపట్లో మైనర్లను సైదాబాద్ లోని జువనైల్ హోమ్ కు తరలించనున్నారు.
Also Read
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
తాజావార్తలు
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!