MLA Jagga Reddy: ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jagga Reddy: ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని భువనగిరి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకానున్నారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిర్వహణ ఆషామాషి కాదని అన్నారు. సభలు, సమావేశాలు హడావుడి మామూలే అని తెలిపారు. వాస్తవరూపంలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఇప్పటివరకైతే అలాంటిది జురుగుతున్నట్లుగా లేదని అన్నారు. తెలంగాణలో ఎన్నికలంటే, 20 కోట్లా, 30 కోట్లా అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలలో ఉన్న లోపాలు, జరుగుతున్న పొరపాట్లు, జరగబోయే నష్టం రాహుల్ గాందీకీ నేరుగా చెప్తానని అన్నారు. ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేద్దామనుకున్న పనులను కూడా చేయలేమని అన్నారు. ఇప్పటికే నష్టం జరిగిందని తెలిపారు. జైపాల్ రెడ్డి మేధావులందరూ కలిసి రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంత నష్టం చేశారని ఆరోపించారు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపురావడంతో.. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం 21 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే టీపీసీసీ సమీక్షా సమావేశంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?