Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కుమార్తె తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తిరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. రెండు రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్ ను తుల్జాభవాని రెడ్డి కూల్చివేశారు. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం ప్రకటించారు. సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని రాజు భాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.
Read also: Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మరోవైపు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు. ఆదివారం (25)న ఉదయం చేర్యాలకు చేరుకున్న తుల్జా భవానిరెడ్డి తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న కంచెను కూల్చివేసారు. అయితే పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తన తండ్రిని క్షమించాలని తుల్జా భవాని గ్రామస్తులను కోరింది. ఊరి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తండ్రిని క్షమించాలని బోర్డు కూడా పెట్టింది.
ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇస్తానని తుల్జా భావన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు 70 ఏళ్లు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందు వెయ్యి కోట్ల ఆస్తి ఉండేవారు.. అలాంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు.. చెరువు భూమి నా పేరు మీద రిజిష్టర్ చేశారు.. అది.. తప్పు జరిగిందా..క్షమించండి..అని ప్రశ్నించారు.మళ్లీ ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద రాసిస్తున్నాను.ఇదిలా ఉండగా జనగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భవానీ బహిరంగంగా నిలదీసిన విషయం చర్చనీయాంశకంగా మారింది.
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 950 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!