Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కుమార్తె తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తిరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. రెండు రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్ ను తుల్జాభవాని రెడ్డి కూల్చివేశారు. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం ప్రకటించారు. సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని రాజు భాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.
Read also: Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
Also Read
మరోవైపు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు. ఆదివారం (25)న ఉదయం చేర్యాలకు చేరుకున్న తుల్జా భవానిరెడ్డి తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న కంచెను కూల్చివేసారు. అయితే పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తన తండ్రిని క్షమించాలని తుల్జా భవాని గ్రామస్తులను కోరింది. ఊరి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తండ్రిని క్షమించాలని బోర్డు కూడా పెట్టింది.
ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇస్తానని తుల్జా భావన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు 70 ఏళ్లు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందు వెయ్యి కోట్ల ఆస్తి ఉండేవారు.. అలాంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు.. చెరువు భూమి నా పేరు మీద రిజిష్టర్ చేశారు.. అది.. తప్పు జరిగిందా..క్షమించండి..అని ప్రశ్నించారు.మళ్లీ ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద రాసిస్తున్నాను.ఇదిలా ఉండగా జనగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భవానీ బహిరంగంగా నిలదీసిన విషయం చర్చనీయాంశకంగా మారింది.
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 950 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?