Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కుమార్తె తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తిరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. రెండు రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్ ను తుల్జాభవాని రెడ్డి కూల్చివేశారు. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం ప్రకటించారు. సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని రాజు భాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.
Read also: Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
Also Read
మరోవైపు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు. ఆదివారం (25)న ఉదయం చేర్యాలకు చేరుకున్న తుల్జా భవానిరెడ్డి తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న కంచెను కూల్చివేసారు. అయితే పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తన తండ్రిని క్షమించాలని తుల్జా భవాని గ్రామస్తులను కోరింది. ఊరి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తండ్రిని క్షమించాలని బోర్డు కూడా పెట్టింది.
ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇస్తానని తుల్జా భావన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు 70 ఏళ్లు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందు వెయ్యి కోట్ల ఆస్తి ఉండేవారు.. అలాంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు.. చెరువు భూమి నా పేరు మీద రిజిష్టర్ చేశారు.. అది.. తప్పు జరిగిందా..క్షమించండి..అని ప్రశ్నించారు.మళ్లీ ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద రాసిస్తున్నాను.ఇదిలా ఉండగా జనగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భవానీ బహిరంగంగా నిలదీసిన విషయం చర్చనీయాంశకంగా మారింది.
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 950 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!