Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గెలుపు ఖాయం.. మెజార్టీ కోసం పోటీ చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించి మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్ల కోసం మైనారిటీ జపం చేస్తున్నారని మండిపడ్డారు.
ముస్లింలకు ఉద్యోగాల్లో 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మోడీ వాస్తవం మాట్లాడుతుంటే.. రాజకీయంగా ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుందన్నారు. మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే కాంగ్రెస్ సహించ లేక కర్ణాటకలో ముస్లింలను బీసీలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని మాజీ సీఎం న్యాయ స్థానాలను ప్రశ్నించడం అంటే ఎంత నిరాశలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు.
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
Read also: Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
ఇక ఆయన బిడ్డపై ప్రేమతో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నారని, కేసుతో సంబంధం ఉన్నవారు లొంగిపోయి నిజాలు బయటపెడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. అంతే కాకుండా.. కేసీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, పార్టీ ఫిరాయింపులను హోల్సేల్గా ప్రోత్సహించారని, మంత్రి పదవులు దిగజారి రాజకీయం చేశారని మండిపడ్డారు. బీజేపీ ఏ ప్రభుత్వాన్ని పడగొట్టదని, బీజేపీకి ఎలా సాధ్యమని అన్నారు.
ఇక.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 8 సీట్లతో అధికారంలోకి రావడానికి బీజేపీయే అధికారంలో ఉంది. అంతేకాకుండా.. పైగా బీఆర్ఎస్కు 17 స్థానాల్లో డిపాజిట్లు దక్కితే ఆకాశమే హద్దు అని, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీయే ఎక్కువగా గెలుస్తోందని తెలిపారు. సికింద్రాబాద్లో తమదే గెలుపు ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.. మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయండి
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!