Seed Companies Fraud: లక్కీడ్రాలు, స్కీంల పేరిట విత్తనకంపెనీల మోసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా కొత్త వెరైటీలంటూ రైతుల ఉసురుపోసుకుంటున్నారు..ఏదో రకం అంటూ అంటగట్టడం నష్టపోవడం రైతన్న వంతౌతోంది..
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని రూరల్ మండలం లోకారి,పిప్పల్ దరితోపాటు ఉట్నూర్ ఏజెన్సీలోని పలు గూడెల్లో విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులను నమ్మించి బుట్టలో వేస్తున్నారు. ఆషామాషీ కాదు బంపర్ ఆఫర్ అంటూ బోల్తా కొట్టిస్తున్నారు.. కేవలం తమ కంపెనీల విత్తన ప్యాకెట్లు మూడు కొంటే చాలు ఎద్దుల జత లేదంటే హెల్మెట్ ఇలా రకరకాల గిప్టు ప్యాక్ లంటూ గ్రామాల్లో ఊదరగొడుతున్నారు..అంతేకాదు కేవలం రెండువందలు కడితే భారీ గిఫ్ట్ మీసొంతం చేసుకోవచ్చంటూ అడ్వాన్స్ బుకింగ్ చేస్తూ కూపన్ల పంపిణీకి తెరలేపారు. రైతులను మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే ఎత్తులేస్తున్నారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
గతంలో కొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం అలాగే గిప్టుల పేరుతో ఒక్కటి కాదు రెండు కాదు 5 వేలమంది నుంచి ఒక్కోక్కరి వద్ద 200 రూపాయల చొప్పున లక్కీ డ్రా పేరిట వసూల్ చేశారు .గిప్ట్ మాత్రం ఎవ్వరికి రాలేదు..పైగా తామంతా మోసపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..పైగా ఇచ్చిన సీడ్స్ సైతం కాతపూత లేక పెట్టుబడి సైతం లాస్ అయ్యామంటున్నారు.. ఇప్పుడు సైతం నదుల పేరున్న ఓ కంపెనీ,మరో రెండు కంపెనీల ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో తిరుగుతూ మళ్లీ వసూల్లు చేస్తున్నారని రైతులు చెప్పుతున్నారు.
లక్కీ డ్రా ల పేరిట డబ్బులు వసూల్ చేయడం నిబంధనలకు విరుద్దం. పైగా ఎవరూ అడ్వాన్స్ బుకింగ్ చేయించు కోవద్దు..ఎలాంటి వెరైటీ అయినా అందుబాటులోనే ఉంటుంది..కంపెనీలు ఎలాంటి ప్రచారం చేసినా విత్తనాలు కొనుక్కోవాలని వత్తిడి చేసినా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు..ఎవ్వరైనా లక్కీడ్రాల పేరుతో వసూళ్లకు తెగిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు అధికారులు. ఇలా విత్తన కంపెనీల మోసాలకు ఏటా అన్నదాత బలౌతున్నా అధికారులు చేపట్టేచర్యలు నష్టాలను ఏమాత్రం నివారించలేకపోతున్నాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..