Sangareddy: వెల్లివిరిసిన మానవత్వం.. భిక్షాటన చేస్తూ మృతి చెందిన వృద్ధురాలికి దహన సంస్కారం..
- సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) రాంసాన్ పల్లి గ్రామంలో వెల్లివెరిసిన మానవత్వం..
- వలస వచ్చి మృతి చెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఆందోల్ మండలం రాంసాన్ పల్లి గ్రామ ప్రజల్లో మానవత్వం వెల్లివెరిసింది. అక్కడి ప్రజలు చేసిన పనికి అందరూ ప్రశంసలతో వారిని ముంచెత్తుతున్నారు. ఈ కాలంలో పక్కనున్న మనిషి ప్రాణాలు పోతున్నా చూస్తూ కొందరు సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. మరి కొందరైతే అలా చూస్తూ మొఖం తిప్పుకుని పక్కకు పోయే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాదు.. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు వారికి భారంగా భావించి నడిరోడ్డుపై వదిలేసి వెళ్తుంటే ఆ బాధ వర్ణనాతీతం.. కానీ ఓ గ్రామ ప్రజలు చేసిన పనికి అందరూ సలామ్ కొడుతున్నారు. ఆ గ్రామ ప్రజలకు అంతటి గొప్ప మనస్సు, సంస్కారం ఇచ్చిన ఆ పెద్దలకు చేతులెత్తి నమస్కారం పెట్టినా తక్కువే. వలస వచ్చి ఆ గ్రామంలో భిక్షాటన చేస్తూ చనిపోయిన ఓ వృద్ధురాలికి దహన సంస్కారం చేసిన ఘటన ప్రస్తుత మానవీయ సంబంధాలకు అద్దంపట్టే విధంగా ఉంది.
Read also: Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్ పల్లి గ్రామంలో ఓ వృద్దురాలు వలస వచ్చింది. ఆమె పేరు రాములమ్మ. 25 ఏళ్ల కిందట గ్రామానికి వలస వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అదే గ్రామంలో రాములమ్మ భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. ఆ గ్రామంలో ఇంటింటికి తిరుగుతు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. కానీ రాములమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆమెకు పిల్లలు ఉన్నారా లేదా అనేది కూడా ఆగ్రామ ప్రజలకు ఆరా తీయలేదు. కానీ రాములమ్మ ఇంటింటి తిరుగుతూ భిక్షాటన చేస్తూ బతుకుతుండేది. కుటుంబ సభ్యురాలిగా భావించి వృద్ధురాలికి గత కొన్నేళ్లుగా గ్రామస్తులు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే శుక్రవారం ఆస్వస్థతకు గురైన రాములమ్మ మృతి చెందింది. దీంతో గ్రామస్థులు రాములమ్మ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఊరు ఊరంతా ఏకమై డబ్బులు సేకరించి రాములమ్మ దహన సంస్కారాలు చేసి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!